
ఝరాసంగం, వెలుగు: మండల పరిధిలోని మాచునూర్గ్రామ శివారులో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సోమవారం కలెక్టర్ క్రాంతి, ఎంపీ సురేశ్కుమార్షెట్కార్, అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పరిశీలించారు. ఈ నెల 23న జహీరాబాద్ఏరియాకు సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నందున కేంద్రీయ విద్యాలయంతో పాటు నిమ్జ్వెళ్లడానికి వేసిన రోడ్డును పరిశీలించారు. కాగా సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. వారి వెంట ఆర్డీవో రాంరెడ్డి, డీఎస్పీ రాంమోహన్రెడ్డి, డీపీవో సాయిబాబా, తహసీల్దార్తిరుమల్రావు, ఎంపీడీవో సుధాకర్ఉన్నారు.